CK Life History -- ప్రజా నాయకులు “సి.కె”




ప్రజా నాయకులు “సి.కె”


గం గణపతే స్వాహా
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

ఒక మాట
రాయలసీమ అభివ్రుద్ది మండలి చేర్మన్ సి.కె.బాబు @ సి.కె.జయచంద్రా రెడ్డి గారు జన్మించిన 1952 వ సంవత్సరానికి నేటికి నడుమ 57 సంవత్సరాలు గడిచిపోయాయి. నాటి గోరంత దీపం నేటి పూర్ణచంద్రునిగా వ్రుద్ది చెందడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ కథను ఈ 16 పేజీల చిన్ని గ్రంథంలో చెప్పడం సప్త సముద్రాలను ఒక టేస్ట్ ట్యూబులో భందించ చూడటమే అవుతుంది. అగస్త్య మహర్షి పొంగి పరవళ్ళు తొక్కే కావేరిని తమ కమండలంలో భందించాడట. అంతటి సమర్థత మనకు లేదు, భవిష్యత్తులో ఎందరో రిసెర్చ్ స్కాలర్లు పరిశోదన చేసి డాక్టరేట్ పొందడానికి దోహద పడ గల లోతు,,త్యాగం,ఎదురీత,ధీరత్వం, ప్రజా సేవ సి.కె.జీవితంలో ఉన్నాయన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ మాటను నొక్కి చెప్పడమే ఈ చిన్ని గ్రంథంయొక్క లక్ష్యం.


సి.కె.బాబు@జయచంద్రా రెడ్డిని తెలియని వారు ఈ రాయల సీమలో ఎవరూ ఉండరు. 2009 నూతన సంవత్సర కానుకగా క్యేబినెట్ హోదా గల రాయలసీమ అభివ్రుద్ది భొర్డు చేర్మన్ పదవిని రాష్ఠ్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి సి.కె.బాబు కు కేటాయించడంతో రాయలసీమలోని నాయకులే కాక యావత్ రాష్ఠ్రమే ఎవరీ సి.కె.అని సి.కె వైపు చూసింది.

సి.కె. ,వై.ఎస్.మద్య గల అనుబంధం ఈ నాటిది కాదు. 33 సం.ల నాటిది.సి.కె.రాజకీయ ప్రస్తానంలో తొలిసారిగా కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎంపికై వైస్ చేర్మన్ గా ఎకగ్రీవమైన రోజుల్లో స్థానిక బడానాయకులు కొందరు స్వపక్షీయులు సి.కె.ను అన్ని విదాలుగా తొక్కి వెయ్యాలని నడుం కట్టిన డా.వై.ఎస్. పి.సి.సి.అధ్యక్షులుగా ,సి.ఎల్.పి నేతగా ఉన్న రోజుల్లోనె సి.కె.బాబుకు సంఘీభావం వ్యక్తం చేసారు, అండగా నిలిచారు. సదుంలో జరిగిన అమరనాథ్ రెడ్ది సంతాప సభలో,1985న స్థానిక కన్నన్ కళాశాలలో జరిగిన భారి భహిరంగ సభలో రాష్ఠ్రంలో తమ ప్రియ శిశ్యులు ఇద్దరేనని అందులో సి.కె. ఒకరని ప్రకటించారు. ఈ అనుభంద నేపథ్యం తెలిసిన వారికి ఈ విషయమై ఏ మాత్రం ఆస్చర్యం కలగదు.

ప్రజా పక్షం వహించి విపక్ష నేతల ప్రేరేపిత రౌడియిజానికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తున్న సి.కె.తమ ఆరాథ్య దైవం షిర్డి సాయిబాబాకు తదుపరి విశ్వసించే ఏకైక వ్యక్తి డా.వై.ఎస్.మాత్రమె. 1983నాటి ఎన్.టి.ఆర్.ప్రభంజనంతో కొంత డీలాపడిన కాంగ్రెస్ పార్టిని బలోపేతం చెయ్యడానికి సె.కె.బాబుకు డా.వై.ఎస్.ఎంతగానో ప్రోత్సహించారు.

ఇక సి.కె.రాజకీయ ప్రస్తానంలో ముఖ్య అద్యాయాలను ఇప్పుడు చూద్దాం.

1952 వ సం.మార్చ్ నెల,24 నాడు చిత్తూరు గ్రామ పెద్ద సి..క్రుష్ణారెడ్డి, అమ్మణమ్మ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన సి.కె.బాబు ఇప్పట్లో తెరమీదికి వస్తున్న ఇన్స్ టెంట్ కాఫిలాంటి నాయకుల్లా సిని గ్లామరో,దన బలమో,రాజకీయ వారసత్వమో లేక, సమాజమనే దేవాలయాన తనకు తానై వెలసిన స్వయంభువలె రాజకీయ రంగంలో గోరంత దీపంగా భయలుదేరారు. నేడు పున్నమి చంద్రునివలే కొండంత వెలుగును వెద జల్లుతున్నారు..ఎన్ని సార్లు చాయా గ్రహమైన కేతువు చంద్రుడ్నిమ్రింగ చూసినా ఆ చంద్రుడు కొత్త వన్నెలతో మెరిసిపోతూనే వుంటాడు. ఇది మన ’జయ’చంద్రునికి ఇట్టే సరిపోతుంది.


మైత్రి భందం:
సి.కె.చిన్న తనంనుండి స్వతంత్ర భావాలతో పెరిగారు. భంధువర్గాలకన్నా ఆయన జీవితంలో మైత్రి భందానికే ఎక్కువ ప్రాధన్యత ఇచ్చేవారు. ఎవరు ఏం చెప్పినా శ్రద్దగా వినేవారు. ఎందరి మాటలు విన్నా నిర్ణయం మాత్రం తనదే. చిత్తూరు టౌన్, పాతమార్కెట్ వీథిలోని జైహింద్ పాఠశాలలో తమ ఎలిమెంటరి చదువులు పూర్తి చేసి అప్పట్లో బోర్డ్ హై స్కూలుగా పేరొందిన నేటి పి.సి.ఆర్.కళాశాలలో అప్పర్ ప్రైమరి,హై స్కూల్ విథ్యతో పాటు రెండు సంవత్సరాల ఇంటర్ విథ్యను పూర్తి చేసారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కాలేజి యూనియన్ సెక్రట్రిగా,ద్వితీయ సం . చేర్మన్ గా ఎంపికై తమ వంతు సేవ చేస్తూ తమ నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు.


నాటి రౌడీ రాజ్యం:
మనిషిపై ,ముఖ్యంగా యువత పై సామాజిక వాతావరణం యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. సి.కె.విథ్యార్థి దశలో ఉన్న సమయాన చిత్తూరు టౌన్ లో వీథి,వీథికి దాదాలు ,రౌడీలు,గూండాలు ఉండే వారు. స్త్రీలే కాక పురుషులు సైతం రాత్రి 7గం.ల తరువాత రోడ్డు మీద స్వేచ్చగా నడవలేని పరిస్థితి ఉండేది. పిక్ ప్యాకెట్లు,అల్లరి మాకులు,ఆకతాయిలకు ఆ రౌడీల అండ దండలు ఉండేవి. ఆ రౌడీలకు నాటి “పెద్ద మనుషులు” కొందరు పరోక్షంగా,బాసట కల్పించే వారు. కాలేజి యూనియన్ ఎన్నికల్లో సైతం సతరు రౌడీలదే హవా ! పట్టణంలొని కొన్ని సినిమా హాళ్ళల్లో అయితే పురుషుల పర్సులకు మహిళల శీలాలకు గ్యారంటి ఉండేది కాదు. అనేక ప్రాంతాల్లో దాదా మామూళ్ళు వసూలు చేసేవారు.



దిక్కు మొక్కు లెక:



నాటి రౌడియిజానికి,ఆకతాయిల వేదింపులకు గురై ఎందరో యువతులు,విథ్యార్దునులు ఏకంగా ఆత్మహత్యకే పాల్పడితే, జరిగిన అన్యాయాయాన్ని కనీశం చెప్పుకునే దిక్కుమొక్కు లేని ధీన స్థితి ఆనాడు ఉండేది. తమ కూతుళ్ళు అన్యాయమై పోతే కనీశం పోలీసులకు ఫిర్యాదు చేసే స్థితి కూడ లేక పోయింది. ఒక బడా నేత సోదరుడు ఒకతన్ని తల నరికి, సరాసరి స్టేషనుకు వెళితే అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పి ఆ కేసును ఏమి లేక చేసిన దాఖలాలున్నాయి.


కాంగ్రెస్ పై అభిమానం:

దేశానికి స్వాతంత్రయం తెచ్చి పెట్టి , బడుగు,బలహీణ వర్గాల ప్రజల జీవితాల్లో కొత్త వెలుగును నింపిన కాంగ్రెస్ పార్టి పై ,గాంథి,నెహ్రూ,ఇందిరా గాంథీలపై సి.కె.బాబుకు ఎంతో గౌరవం ఉండేది. ఈ స్ఫూర్తితోనే అప్పట్లో చిత్తూరులో కాంగ్రెస్ పార్టి తరపున ఎమ్.ఎల్.ఎ.గా పోటి చేసిన ఆంజనేయులు నాయుడు,ఎం.పి.గా పోటిచేసిన పొలకల నరసింహా రెడ్డిల విజయానికి తమ వంతు క్రుషి చేసారు. అలాగే కిరోసిన్ డీలర్ గా పేరొందిన హరిప్రసాద్ ను మునిసిపల్ చేర్మన్ చేయడానికి తమవంతు క్రుషి చేసారు.(భవిష్యత్తులో ఇతను తె.దే.పా.తరపున సి.కె.పై పోటికి దిగి ఓటమి పాలు కావడం విదితమె!)


ఎదురీత:
బాల్యంనుండి స్వతంత్ర భావాలతో ఎదిగిన సి.కె.బాబుకు ప్రజల స్వేచ్చా జీవితానికి గండి కొట్టే రౌడియిజం పై చికాకు కలిగించింది. తమ దాక ఏమి రానప్పటికి దాయాదులు,భందువులకన్నా తానెక్కువగా చూసుకునే తమ మిత్రులకు ఆ దుష్ఠ శక్తుల నుండి బెదిరింపులు,దాడులు ఎదురైనప్పడు సి.కె. ప్రతిఘఠించేవారు. ఈ విషయమై సి.కె.యువతను చైతన్య పరిచేవారు. సన్మార్గంలో నడిపేవారు. దీంతో అడ్డు,అదుపు లేక రెచ్చి పోతున్న దుష్ఠ శక్తుల చూపు సి.కె.పై పడింది. దీంతో సి.కె.డిగ్రీ చదువులను కళాశాలలో కొనసాగించ లేక మిత్రుల సలహాతో ఓపెన్ యూనివర్సిటి ద్వార డిగ్రీ చెయ్యాల్సి వచ్చింది.


జై ఆంథ్రా మరియు హింది వ్యతిరేక ఉద్యమం:(1969-72)
రాష్ట్రంలో సమైఖ్యాంథ్రా కొరకు జై ఆంథ్రా ఉద్యమం ఊపందుకున్న రోజులవి. సి.కె.జిల్లాలో జై ఆంథ్రా ఉధ్యమంలో తమ అనుచర గణాలతో చురుగ్గా పాల్గొని అరెస్ట్ అయ్యారు. అలాగే హింది వ్యతిరేక ఉద్యమంలోను చురుగ్గా పాల్గొన్నారు. విథ్యార్థి దశలోనె చదువులు పాడు చేసుకుని మరి ప్రజా సమస్యలపై జైలుకెళ్ళిన ఘనత ఒక్క సి.కె.బాబుకే దక్కింది.


నిరుధ్యీగిగా:

తమ విథ్య పూర్తయ్యాక తండ్రి క్రుష్ణా రెడ్డి ప్రతినిదిగా కూరగాయల మార్కెట్ గేట్ కలెక్షన్,తమ కుటుంభానికి చెందిన పిండి మిషన్ నిర్వహణకు పరిమితమవుతూ ఖాళి సమయాల్లో మిత్రులను కలుస్తూ పట్టణంలోని ఆశాంతి ,అబద్రతల పై వారిలో అవగాహణ కల్పిస్తూ అవసరమైతే ప్రత్యక్ష ప్రతిఘఠణలకు సైతం సిద్దమయ్యేవారు. నాటి భయానక వాతావరణంలో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతుంటే,పోలీసుల నిస్సహాయత లా అండ్ ఆర్డర్ ను అవహేళన చేస్తుంటే “మీ కోసం.. నేనున్నాను “అని ముందుకొచ్చిన ఏకైక నేత సి.కె.


ఒంటరి పోరాటం:
అందరు తల్లి ,తండ్రుల వలే సి.కె.తండ్రి కూడ సి.కె.తమ మిత్రుల కొరకు కష్ఠాలు కొని తెచ్చుకోవడాన్ని ఖండించేవారు. స్వతంత్ర భావాలు గల సి.కె.తండ్రి ఆంక్షలకు దూరంగా ఉండాలని కొంతకాలం తమ కుటుంభానికి చెందిన ఫ్లోర్ మిల్ ,తదుపరి గూడ్స్ షెడ్ కే పరిమితమయ్యేవారు. ఫ్లోర్ మిల్ తో వచ్చే స్వల్ప ఆదాయంతోనే మిత్రులతో గడిపిన రోజులవి.


రాజకీయ అరంగేట్రం:(1987)

పురపాల ఎన్నికలు వచ్చాయి. మిత్రుల ప్రోత్బలం,సహకారంతో మునిసిపల్ కౌన్సిలర్ గా సి.కె.బరిలో దిగారు.ఏకగ్రీవంగా గెలుపు పొందారు. అలాగే మెజారిటి కౌన్సిలర్ల మద్దత్తుతో ఏకగ్రీవంగా వైస్ చేర్మన్ గా ఎంపికయ్యారు. నాటి బడా నాయకులు బి ఫారాలను గుత్తకు తీసుకోవడంతో నిజమైన కార్యకర్తలను భరిలో దింపి వారిలో చాలా మాంది ఏకగ్రీవంగా గెలుపు పోందడంతో సి.కె. వైస్ చేర్మన్ గా ఎంపిక కావడం సునాయసంగా జరిగి పోయింది. హైయర్ సెకండరి పాఠ శాలలు మొదల్గొని, డిగ్రి కళాశాల వరకు విథ్యార్ది సంఘాల ఎన్నికల్లో చక్రం తిప్పి వారిని నాతి రౌడియిజం కోరల్లోనుండి రక్షించడమే ఈ రాజకీయ అరంగేట్రాఅనికి దోహదం చేసింది.


సి.కె.పై హత్యా యత్నాలు:
అప్పట్లో రాజ్యమేలిన దుష్ఠ శక్తులు తమ ఆగడాలకు అడ్డు తగులుతున్న సి.కె.ను పొట్టన పెట్టుకో చూసిన సందర్బాలు ఎన్నో ఎన్నెన్నో !

డిగ్రీ కళాశాల ఆవరణలోనుండి కిడ్నాప్ చేసి, ఫైర్ ఆఫీసు వద్ద పాశవికంగా దాడి చేసి ప్రాణం పోయిందని భావించి వదలి వెళ్ళిపోతే సి.కె.మనకు దక్కారు. తదుపరి చొత్తూరు
క్లబ్బు వద్ద(2007 ,ఫిబ్రవరి,9 నాటి సంఘఠన కాదు అందుకు పూర్వం జరిగిన హత్యా యత్నమిది) ,తమిళనాడులోని ఒక హోటల్ వద్ద ఇలా ఎన్నో సార్లు సి.కె.పై హత్యా యత్నాలు జరిగాయి. ఈ ఉదంతానికి కారకులైన రౌడీలను తమిళ నాదు పోలీసులు అరెస్ట్ చేస్తే వారిని ఎవరు ఎలా విడిపించారో పెద్దలకు తెలుసు. వారు నేదు ఎం.ఎల్.ఎ.టిక్కెట్ కోరే హక్కు తమ కుటుంభాన్ఇకి ఉందని చెబుతున్నారు . ఇది ఎంతటి హాస్యా స్పదమో అలోచించండి. అయినా సి.కె.వెనుకడుగు వెయ్యలేదు. సి.కె. తెగింపుతో ,త్యాగంతో చీకటియుగం క్రమేనా ముగిసింది. ప్రజలు నిట్టూర్చారు.


ఇండిపెండెంట్ ఎమ్.ఎల్.ఎ (1989):

అప్పటి తె.దే.పా ఎన్.టి.ఆర్ నేత్రుత్వంలో చురుగ్గా ఉండేది.ఎన్.టి.ఆర్ ప్రసంగాలు జన బాహుళ్యాన్ని మంత్ర ముగ్దుల్ని చేసేవి. ఈ నేపథ్యంల్ ఆ హవాను ఎదుర్కొనే సత్తా ఒక సి.కె.బాబు కే ఉందని భావించిన మెజారిటి కాంగ్రెస్ పార్టి వర్గాలు ఎం.ఎల్.ఎ టికెట్ కోసం దరఖాస్తు చెయ్యమని సి.కె.పై వత్తిడి తెచ్చేరు. సి.కె.తలొగ్గ్గ్గేరు.

సి.కె.ముక్కు సూటి మనిషి .ఇతరుల వలే ఇతరత్రా మార్గాలతో పనులు సాధించుకోవడం అతనికి అసాధ్యం . ఈ నేపథ్యంలో మరో నేతకు పార్టి టికెట్ దక్కింది. టికెట్ పొందినప్పటికి సి.కె.బాబుకున్న ప్రజాభలం ముందు ఆ నేత చిత్తుగా ఓడిపోయారు. ఇద్దరు సారా సామ్రాట్టులకు వ్యతిరేకంగా సి.కె.సాధించిన ఘన విజయానికి అప్పటి నిరుధ్యోగ,సంపాదనకు మరుగని వైస్ చేర్మన్ స్థాయికి ఎక్కడా పొంతన కుదరదు. అదే సి.కె. రాజకీయ చరిత్రయిక్క విశిష్ఠత. చరిత్ర పిచ్చివానివలే మళ్ళి ఒకే విషయాన్ని వాగుతుంటుంది. దీనిని సంబందిత వర్గాలు గుర్తెరిగి నడుచుకుంటే మేలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


18000 ఓట్ల మెజారిటి:

ఆ ఎన్నికల్లో సి.కె.18000 పై చిలుకు మెజారిటి సాధించారు. పార్టి అండ లేదు,టిక్కెట్ లేదు,దన బలం లేదు,ఇప్పట్లో కొందరిలా చీరలు పంచ లేదు,ప్రోనోటు పై సంతకం చెయ్యించుకుని రూ.5000 పంచ లేదు. నన్ను గెలిపిస్తే ఇది మీకే స్వంతమని ఆశలు చూపలేదు ,నేను ఓడిపోతే తిరిగివ్వాలని ఫిట్టింగ్ పెట్ట లేదు. అయినా 18000 ఓట్ల మెజారిటి అఖండ విజయం సి.కె.ను వరించింది. గతంలో సి.కె.పట్టణ శాంతి భద్రతలకొరకు చేసిన క్రుషిని ప్రజలు మెచ్చారు. సి.కె.త్యాగాన్ని ప్రజలు గుర్తించారు. అంతకు పూర్వం కాని,ఆ తరువాత కాని విపక్షాలు,స్వపక్షీయుల కుట్రలు కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఒక ప్రైవేటు టి.వి.చేనల్ ప్రసారం చేసిన కల్పిత కథనం కూడ ఈ కుట్రల్లో ఒక భాగమే. గతంలో తాను పని కట్టుకుని విమర్శించిన నేతను వదిలి సి.కె.పై పడటమంటే ఆ నేతతో భేరం కుదిరినట్లే ! కొత్త ప్రాజక్టు అందుకున్నట్టే అని కొందరు మీడియా సోదరులే విశ్లేషిస్తున్నారు.



త్రాగు నీటి సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష(1991):


నవంబరు ౩౦ వ తేదీన చిత్తూరు త్రాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం కోరుతూ చిత్తూరు గాంథి విగ్రహం వద్ద సి.కె.11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.నాటి కలెక్టరు లిఖిత పూర్వక హామి ఇవ్వడంతో దీక్ష విరమించారు.


కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ1994 :

గతంలో టిక్కెట్ నిరాకరించి కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలు ఈ విడత సి.కె.కు టిక్కెట్ ఇచ్చారు. రాష్ఠ్రమంతట ఎన్.టి.ఆర్ ప్రబంజనం చోటు చేసుకుంటే ఆ ప్రభంజణంలో జిల్లాకు చెందిన అందరు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలైతే కేవలం ప్రజా బలంతో “జిల్లాకొకరు”గా సి.కె.గెలుపు పొందారు.



పురపాలక ఎన్నికల్లో ఫ్యాక్షనిస్టుల పాగా:

అసెంబ్లి ఎన్నికల్లో సి.కె.విజయాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం తదుపరి జరిగిన పురపాలక ఎన్నికల్లో తాము ఇందాక సి.కె.పై చేస్తూ వచ్చిన అబద్దపు ప్రచారాలను తన వ్యూహంగా ఎన్నుకుంది. కేవలం రౌడిలను కాదు, ఏకంగా పొరుగు జిల్లానుండి ఫ్యేక్షనిస్టులను రంగంలో దింపింది. సి.కె.సతిమణి పురపాలక చేర్మన్ మహిళా అభ్యర్థిగా భరిలో ఉంటే సి.ఎం.సోదరులు,జిల్లా మంత్రులు,13 మంది ఎం.ఎల్.ఎ.లు ఫ్యేక్షనిస్టులను చిత్తూరు మీదికి వదిలి వారికి ప్రత్యక్షంగా సూచనలిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ,కనీశ విలువలను తుంగలో తొక్కేరు. అంత నీచానికి దిగ జారి మరి అధికారాన్ని చేజిక్కించుకున్న వారు సాధించిందేమి..కనీశం రొటీన్ గా జరగవలసిన ఆడిట్ ను సైతం జరగనివ్వక ,ప్రభుత్వ నిదులు అందకుండా చేసి,అప్పుల పాలు చేసి ,ఇంటి పన్నులను విపరీతంగా పెంచి, తర్క రహితంగా షాపింగ్ కాంప్లెక్సులు కట్టి ,నిరర్థక ఆస్తులుగా మార్చారు. వారి వైఫల్యాలకు గాంథి సర్కిల్ లో ఎన్.టి.ఆర్ విగ్రహం వెనుక అసంపూర్ణంగా నిలిచిన వాటర్ ఫాల్స్ ఒక చిన్న ఉదాహరణ.
ఎన్.టి.ఆర్ బతికి ఉండగా ,ఆయనకు పక్షవాతం వస్తే గుక్కెడు నీళ్ళివ్వని నేతలు బాబు వెన్ను పోటుతో ఆయన మరణించాకన్నా ఇంత చలవ సమకూరుస్తామనుకున్నారేమో. మరి అదీ అర కొరగా ఉండి పోవడమే వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.



హ్యేట్రిక్ ఎం.ఎల్.ఏ(1999):

ఇదివరకే రెండు పర్యాయాలు ఎం.ఎల్.ఎ.గా సి.కె.గెలుపు పొందినప్పటికి ప్రత్యర్థి వర్గాలు సి.కె.తమ అనుచరుల అనుచిత చర్యల వలనే గెలుపు పొందారని దుష్ప్రచారం చేసుకునే వారు. కాని 1999 లో పాలక పక్షం వారే నీతి నిజాయితీలను ,సి.కె.కున్న ప్రజాభలాన్ని వెలుగులోకి తెచ్చేరు. అప్పుడు చంద్రబాబు నేత్రుత్వంలోని తె.దే.పా.పాలన సాగుతూంది.పాపం బాబు ఇక్కడి నాయకుల మాటలను నమ్మి సి.కె.పై ఎన్నో ఆంక్షలు
విధించారు. పోలింగ్ నాడు సి.కె.వాహణాన్ని షేడో పార్టీ పేరిట పోలీసు బలగాలు వెంబడించాయి. పోలింగ్ సరళిని పరిశీలించటానికి సి.కె.పోలింగ్ భూతులకు వచ్చినప్పుడు తన వారితో మాటన్నా చెప్ప లేని స్థితి. తల్లి చేప తన పిల్లల ఆకలిని కంటి చూపుతోనె తీర్చినట్టు ,కళ్ళతోనె ధీరత్వాన్ని నూరి పోయవలసిన పరిస్థితి. అయినా గెలుపు సి.కె.ను వరించింది.ప్రత్యర్థి వర్గాలు నాటిదాక సి.కె.పై చేస్తూ వచ్చిన దుష్ప్రచారం చంద్ర బాబు పుణ్యమా అని ఇలా నీరుగారిపోయింది. దీనిని చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు. సి.కె.పై ఎలా వేటు వేద్దామా అని కాచుకు కూర్చున్నారు.



నీలాపనిందలు(2003 ,June):

తెలుగు మహిళా నాయకురాలి కొడుకు ఒకతను హత్యకు గురైతే కొడుకును పోగొట్టుకున్న ఆతల్లిని ఓదార్చాలన్న ఇంకిత జ్నానం కూడ లేని ప్రత్యర్దులు పథకం ప్రకారం ఆ దుస్సంఘఠణకు సి.కె.ను భాద్యుల్ని చేయ చూసారు. శవరాజకీయం అంటే ఏమిటో కంటికి కట్టినట్టు చూపారు. బ్రిటీషు వారు స్వాతంత్ర్య పోరాట వీరులకన్నా విధించని ఆంక్షలను సి.కె.పై పెట్టేరు. ఒక ప్రజా ప్రతినిదిగా,ఒక పౌరునిగా అతని హక్కులను కాల రాసారు. వీరే న్యాయ మూర్తులై తీర్పులు చదివేరు. వారికున్న అధికారం చాల్లేదు కాని వీలుంటే దేశబ్రష్ఠం కూడ చేసేవారేమో. జిల్లాలోకి రాకూడదు. పట్టణంలోకి అడుగు పెట్టకూడదు. ఇలా ఎన్నో గొంతమ్మ కోరికలు.



2004 ఎన్నికలు:

ఎన్నికలు వచ్చాయి. కేవలం ఎన్నికల సమయంలోని పార్టి జెండాలను,కండువాలను వెతికి దుమ్ము దులిపి దరించేవారు భయలు దేరారు. సాధారణ పరిస్థితుల్లోనే వారి కుట్రలకు హద్దు అదుపు ఉండదు. ఇంకా నీలాపనిందలను మోస్తున్న సందర్బంలో వేరే చెప్పకర్లేదు.పార్టినుండి సస్పెన్షన్ కు ప్రయత్నించినట్లే సీటును సైతం అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యేరు. సి.కె.కాంగ్రెస్ పార్టి రక్షకులుగా లేకుంటే తె.దే.పా ప్రభుత్వానికి సి.కె.పై తప్పుడు కేసులు పెట్టి వేదించాల్సిన అవసరం ఏముంది. కాని అనచివేతకు గురైనప్పుడు అండగా నిలవ వలసిన పార్టిని పార్టిలోని దుష్ట శక్తులు దూరం చేసాయి.

(ఆ తరువాత సి.కె.పై రెండు పర్యాయాలు హై టెక్ విదానంలో,అధునాతన మెషిన్ గన్,ల్యేండ్ మైన్లతో సిని ఫక్కిలో హత్యా యత్నాలు జరిగితే అవి”సి.కె.స్వంత వ్యవహారమని కూడ ఆ దుష్థ శక్తులు వ్యాఖ్యణించిన తీరును ఇక్కడ గుర్తు చేసుకోవాలనిమనవి)
సి.కె.స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు కోర్టువిచారణలో ఉన్న విషయాలపై తామె న్యాయ నిర్ణేతలై తీర్పులు చదివేరు. దుమ్మెత్తి పోసేరు. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఇలా ప్రభుత్వ,పాలకపక్ష కుట్రలకు కర్ణుడిలా ,కురుక్షేత్రాన పధ్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులా సి.కె. తమ విజయాన్ని బలిపెట్టాల్సి వచ్చింది. ఈ వార్త విన్న ఒక్కొ అభిమాని ఆ ఓటమి తమదే అన్నట్టుగా ఫీలయ్యేరు.




పాత బస్ స్టాండు మూసి వేత:
సి.కె.అభిమానులుగా ఉన్న 90% ముస్లీంలకు,10శాతం హిందువులకు పట్టెడన్నం పెడుతుంది, ఉపాది కల్పిస్తూంది అన్న ఏకైక కారణంతో , కేవలం సి.కె.కున్న ప్రజా భలాన్ని ఏవిదంగానన్నా తగ్గించాలన్న అక్కసుతో కోడి లేనప్పుడు కోడిపిల్లలను కవళించ చూసే రాభంధువుల్లా సి.కె.ను జైల్లో పెట్టించి చిత్తూరు పాత బస్ స్టాండును మూసి వేసి, అడ్డుగోడ నిర్మించారు. దానిని నమ్ముకుని బ్రతికిన చిన్నా చితకా వ్యాపారుల కడుపు కొట్టారు.చిత్తూరు పరిసర ప్రాంతాల్లోనుండి ప్రతి రోజూ పట్టణానికి వచ్చి వెళ్ళే రైతులను,గ్రామ ప్రజలను,మహిళలను ఇబ్బందికి గురి చేసారు. తానే చిక్కుల్లో ఉన్నప్పుడు వీరి గోడును సి.కె. ఎక్కడ పట్టించుకుంటారన్న ధీమాతో ఈ పని చేసి కంగు తిన్నారు. ఘాటైన,ధీటైన ప్రతిఘఠన ఎదురైంది సి.కె.తరపునుండి. పాత బస్ స్టాండును తెరిపించడమె కాక దానిని ఆధూనికరించి తమ అభిమానుల రుణం తీర్చుకున్నారు సి.కె.
తె.దే.పాను సింగిల్ డిజిట్ కి పరిమితం చేసిన పురపాలక ఎన్నికలు:
2004 అసెంబ్లి ఎన్నికల్లో సి.కె.అపజయంతో మానసికంగా క్రుంగిపోయిన సి.కె.అభిమానులు రాష్ఠ్రంలో కాంగ్రెస్ పార్టి ఘన విజయం సాధించడం, సి.కె.ఆత్మీయులు ,గురువర్యులు డా.వై.ఎస్. సి.ఎం.కావడం కొంత ఓదార్పునిచ్చాయి. వారు ఇంతకింత లెక్కలు తీర్చుకోవడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో పురపాలక ఎన్నికల భేరి మ్రోగింది. వై.ఎస్. సి.కె.బాబుకు నియోజిక వర్గ భాధ్యతలు అప్పగించారు. అసెంబ్లి ఎన్నికల్లో కేవలం అధికారాన్ని అడ్డం పెట్తుకుని శవ రాజకీయాలతో గట్టెక్కిన తె.దే.పా. చిత్తు చిత్తుగా ఓడింది. సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. ఎన్నికల రణరంగంలో అన్ని తానై చక్రం తిప్పిన సి.కె. తమ అభ్యర్దన మెరకు కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించిన చిత్తూరు పురప్రజల రుణం తీర్చుకునే పనిలో నిమఘ్నమయ్యారు. పురపాలక సంఘంలో ఒక దశాబ్ద కాలంగా ఆదిట్ జరగక పోవడం వలన ప్రభుత్వ నిథులు అందడంలో చిక్కు ఏర్పడింది. ఏక బిగిన ఆడిట్ జరిగేలా చూసారు సి.కె. నిథులు రానే వచ్చాయి.



పరిపాలణా దక్షత:

అభివ్రుద్దికి శ్రీకారం చుట్టిన సి.కె. కేవలం తమ అభ్యర్థన మెరకు ప్రజలు ఎన్నుకున్న మునిసిపల్ కౌన్సిల్ పనితీరుకు తను పూచి అన్న మనోభావంతో పని చేసారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక పని చేయించడం అంటే అది మాటలు కాదు. అన్యులైన బ్రిటీషు వారు స్వదేశియులైన సిబ్బందిని నమ్మలేక అంచలంచలుగా బొమ్మల కొలువులా తీర్చి దిద్దిన యంత్రాంగం ఇది. పడికట్ల పై కప్పిన వస్త్రాన్ని లాగితే ఎలా అన్ని బొమ్మలు వచ్చి పడిపోతాయో అలా ఏర్పాటైంది. పైగా ఈ కొలువు క్రింద త్రుప్పు పట్టిన బియ్యపు డబ్బాలు,కాలు పోయిన బెంచీలు,పందికొక్కుల నివాసం అన్ని ఉంటాయి. అటువంటి బొమ్మల చేత,బొమ్మల కొలువు లాంటి యంత్రాంగం చేత అభివ్రుద్ది జరిగేలా చూడటం ఎంత కష్ఠమో అర్థం చేసుకుంటే ఒక్క రోజున కోటి రూపాయల అభివ్రుద్ది పనులను (కేవలం పురపాల పరిదిలొ) పూర్తి చేసి ,ప్రారంభించటం ఎంతటి కష్ఠ సాధ్యమో మనమే అంచనా వేసుకోవచ్చు. త్రుప్పు పట్టిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడక్కడ స్పేర్స్ మార్చి,కిరోసిన్ వాష్ చేసి, గ్రీసు కొట్టి సి.కె. ఎంతగా శ్రమించి ఉంటారో అర్థం చేసుకొండీ. తన రాజకీయ హ్యేట్రిక్ ప్రస్తానంలో తొలి ఘట్టంలో APSRTC బోర్డులో ఇమడలెక పోయిన సి.కె. ఆ పై తమ నిర్వాహణలో తాను గడించిన అనుభవంతో వీటిని సాధించ గలిగారన్నది సి.కె.లో చోటు చేసుకుంటున్న దిన దిన పరివర్తన ,పెరుగుతున్న పరిపాలనా దక్షత కు ప్రతీక.



2007,ఫిబ్రవరి 9:

పార్టిలోని ఇతర నాయకులు కాని,ఇతర పార్టి నాయకులు కాని ప్రజలన్నా,కార్యకర్తలన్నా కొంత అలెర్జి ఉంతుంది. వారై ముస్తాబై ప్రజల్లోకి వస్తే దర్శించుకోవచ్చు కాని ప్రజ్లై వారిని కలవాలనుకుంటే అది కష్థ సాధ్యమే. పైగా 90 శాతం మంది నాయకుల జీవితాలు,సమయాలు 30:70 , 40:60 ,50:50 రేషియోలో రాజకీయాలకు,స్వంత వ్యాపారాలకు విభజించ బడి ఉంటాయి. ముఖ్యంగా కార్య కర్తలతో కలిసి టీ త్రాగే నాయకులను వేళ్ళ మీద లెక్కించెయ్యవచ్చు. నాయకులు టిఫనీలు చేస్తున్నా,కాఫీలు త్రాగుతున్నా కార్యకర్తలు వారి ఇంటి భయిట పడికాపులు కాయవలసిందే. కాని సి.కె.ప్రారంభంనుంది మిత్రులతో,కార్యకర్తలతో కలిసి టిఫన్ చెయ్యడం అలవాతు . దీనినే తమకు మంచి అవకాశంగా భావించిన వైరీ వార్గాలు రాజకీయంగా సి.కె.ను దెబ్బ కొట్టలెక కోత్లాది రూపాయలు వెచ్చించి చిత్తూరు క్లబ్బులో సి.కె.తమ అనుచరులతో టిఫన్ కు ఉపక్రమిస్తుంటే ప్రొఫెష్నల్ కిల్లర్స్ చే మెషిన్ గన్ తో కాల్పులు జరిపించారు.


పలమనేరు రోడ్డులో, సి.కె.అంచెలంచలుగా అభివ్రుద్ది చేసిన చిత్తూరు క్లబ్ ఆవరణలో రెప్ప పాటులో జరిగిన ఈ దుస్సంఘఠనలో సి.కె.గన్ మేన్, మునిసిపల్ ఉద్యోగి నావరసు,ఒక దుండగుడు మ్రుతి చెందారు. సి.కె తమ జీవితంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా చేసిన ఉపకారం,షిరిడి సాయి నాధుని ఆశిస్సులతో ప్రాణాలతో భయిట పడ్డారు. మరొకరైతే బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని దేశం వదిలి వెళ్ళిపోయేవారేమో.”ఎవరైతే తన జీవితాన్ని తన ప్రజల కోసం అర్పిస్తాడో అతనే అసలైన నాయకుడు”అన్న పెద్దల సూక్తికి అనుగుణంగా జీవించి స్థిత ప్రజ్నుడు అన్న పదానికి నిర్వచనంగా భగవద్గీతలో శ్రీ క్రుష్ణ పరమాత్ములు చెప్పిన స్థిత ప్రజ్నత్వంతో తమ విధులకు ,ప్రజా సేవకే పరిమితమయ్యేరు.




గంగ జాతర నాడే సి.కె.ను మట్టు పెట్టే కుట్ర(2007 మే):

అనతి కాలంలోనే పోలీసు శాఖ వారు ,దుండగులు గంగ జాతర నాడే సి.కె.ను మట్టు పెట్టేందుకు చేసిన కుట్రను భయిట పెట్టేరు. భగ్నం చేసేరు. ఈ వార్త విన్న మహిళలు,వ్రుద్దులు ప్రత్యర్ది వర్గాల అనాలోచిత పన్నాగాలకు విస్తు పోయేరు. గంగ జాతర సందర్బంగా సి.కె.ప్రజా భాగుళ్యంలోకి వస్తారని సి.కె.ను హత మార్చటం తమకు సులభ తరం అవుతుందని భావించిన వారు “జరుగ రానిది జరిగితే” తద్వారా ఎంతటి ఆందోళన,తొక్కీసలాట,ప్రమాదం వాటిల్లుతుందో,అమాయక ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు,పిల్లలు,వ్రుద్దులు ఎంతటి ప్రమాదానికి గురవుతారో, జాతరకు ఆటంకం వాటిల్లితే గ్రామ దేవత అయిన గంగమ్మ అసంత్రుప్తి చెందితే ,ఆగ్రహిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని క్షణమన్నా తలంచక పోవటాన్ని ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా ఖండించారు. తిట్టి పోసారు. ఒక సారి జాతర స్థలాన్ని మార్చాలని చూసి ఆసుపత్రి రోడ్డులో పందిరి వేయగా పెను గాలి వీచి పందిరి గాలికి ఎగిరి పోవడం అందరికి విదితమే. తల్లిలా రక్షించే గంగమ్మ తల్లి జాతరనే బగ్నం చేయ చూసిన వారు ఎంతటి నీచులో ప్రజలు అప్పుడు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెబుతారని పెద్దలు ఆక్రోశిస్తున్నారు.




2007 డిసెంబరు 31:

పాపిష్ఠి సొమ్ము పాపాలకే ప్రేరేపిస్తుంది. అలా పాపాలతో మూట కట్టుకున్న కోట్లాది రూపాయల సొమ్ము వైరి వర్గాలను మళ్ళి పాపానికే ప్రేరేపించింది. సి.కె.తమ నివాసం నుండి కట్టమంచిలో తాము నిర్మించిన షిరిడి సాయి ఆలయానికి భయలు దేరితే, కన్నన్ ఖళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మలుపులోని కల్వెర్ట్ క్రింద హైటెక్ పరిజ్నానంతో ముందుగానే తాము ఏర్పాటు చేసిన ల్యేండ్ మైన్ తో సి.కె. వాహణాన్ని పేల్చి వేసారు.

సి.కె.ప్రయాణించిన కారు గాలిలోకి ఎగిరి బోల్తా పడి సుజ్జు సుజ్జు అయ్యింది. కేవలం నక్సల్స్ కే సాధ్యమైన ఈ ప్రక్రియ సతరు వైరి వర్గాలకు ఎలా సాధ్యమైందో పోలీసులు నిగ్గు తేల్చ వలసి ఉంది.



తప్పిన పెను ప్రమాదం:

ల్యేండ్ మైన్ పేల్చి వేత సంఘఠణా స్థలాన్ని చూసిన వారు ప్రక్కనే ఉన్న ట్రాన్స్ ఫారం , పెట్రీల్ బంకులను చూసి విస్తు పోయారు. పొరభాటున ఆ ట్రాన్స్ ఫారంకాని, ప్రక్కనే ఉన్న పెట్రీల్ బంకుకాని పేలి ఉంటే ఆ సమయానికి తిరుపతి వైపు వెళ్ళే బస్సులు కాని ఆ ప్రేలుడుకు గురైయ్యుంటే ఎందరి ప్రాణాలు గాలిలో కలిసి పోయుండేవో ! సి.కె.ను పొట్టన పెట్టుకో చూసిన వారికి ప్రజలంటే,వారి ప్రాణాలంటే ఏ మాత్రం లెక్క లేదని ఈ సంఘఠణ మరో సారి నిరూపించింది.
ఈ దుస్సంఘఠనలో ఇద్దరు గన్ మ్యేన్లు మ్రుతి చెందగా డ్రైవర్ సూరి ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిచెర్ల శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర గాయాలకు గురయ్యేరు. ఈ ఉదంతంలో తీవ్ర అస్వస్థతకు గురైన సి.కె.కు పక్షపాతం వచ్చిందని, మాట పదిపోయిందని ప్రత్యర్థులు రక రకాలుగా తమ ఆకాంక్షలను వదంతులుగా ప్రవలింప చేసేరు

కాని 2008,డిసెంబరు,28 నాడు కాంగ్రెస్ పార్టి ప్రకటించిన (తీవ్రవాదానికి వ్యతిరేకంగా )మానవ హారం కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంథిరోడ్డులోని పార్టి కార్యాలయాన పతాకావిష్కరణ చేసి దర్గా సర్కిల్ దాకా వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళి దారిలోని గాంథి ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ,సింహ గర్జన చేసి ప్రత్యర్థుల ఆశలను అడియాసలు చేసారు సి.కె.

సి.కె.కీర్తి కిరీటంలోని కొన్ని రత్నాలు



షిరిడి సాయి ఆలయ నిర్మాణం:


నిత్యం మిత్ర భ్రుందాలు,పార్టి కార్యకర్తలు,ఆశ్రితులు,అభిమానులు ,శ్రేయోభిలాషులు నడుమ బిజి బిజిగా ఉన్నప్పటికి సి.కె.తమకంటూ ఒక ఆథ్యాత్మిక గురువును ఎంచుకోవడం,ఆ గురువే ఆరాద్య దైవంగా సి.కె.మనసున కొలువుండటంఆయన పూర్వ జన్మ సుక్రుతం. ఆ గురువు షిరిడి సాయి అన్నది జగత్ ప్రసిద్దం. తాను ఎంత పని వత్తిడిలో ఉన్నప్పటికి నిత్యం బాబా నామ స్మరణ ,గురువారం,పౌర్ణమి,గురు పౌర్ణమి పూజలను ఏ పరిస్థితిలోను మరిచే ప్రసక్తే లేదు. స్థానిక కట్టమంచిలో మత సామరస్యతకు చిహ్నంగా షిరిడి సాయి మందిరాన్ని సి.కె.నిర్మించారు.
పొన్నియమ్మ గుడి:
గతంలో గంగ జాతర నేపథ్యంలో పొంగలి పెట్టడానికి తప్ప స్త్రీలు అడుగు పెట్ట లేని స్థితిలో ఉన్న పొన్నియమ్మ గుడిని, పోలీసు రెయిడ్ జరిగితే పరిసర లాడ్జీల్లోని వేశ్యలకు దాకునే బంకరుగా ఉన్న పొన్నియమ్మ గుడిని జీర్ణోద్దారణ చేసి సరి కొత్త వైభవం తెచ్చినది సి.కె.బాబుగారే.
గంగ జాతర నిర్వహణ:
గతంలో గంగజాతర చిత్తూరు పట్టణములోని 4వీథులు,లేదా 4 కాలనీలకు పరిమితమై ఉంటే సి.కె.గ్రామ పెద్దగా ఉన్న తమ తండ్రిగారి వారసత్వంతో వంశ పారంపర్య ధర్మ కర్తగా నడుంకట్టి 4 రాష్ఠ్రాలదాక జాతర వైభవం ప్రవలేట్టు చేసింది ఒక్క సి.కె.బాబే అన్నది అందరికి తెలిసిందే.


వాహణాల మండపం:

ఈ నాదు ప్రజా సేవే తమ ఊపిరి అంటూ ప్రజల ముందుకొచ్చిన కాంట్రాక్టర్ ఒకరి నిర్లక్ష్యంతో కుప్ప కూలిన రాముల వారి వాహణాల మండప పున: నిర్మాణం చేసి రామాలయానికి స్థిరాస్థి ,స్థిర ఆదాయం కల్పించింది కూడ సి.కె. ఒకరే ! ఇలా సి.కె.ఆథ్యాత్మిక జీవితం సాగుతూనె ఉంది. సి.కె. నమ్మి కొలిచిన దైవాలు ప్రజా దేవుళ్ళ ఆశిస్సులే సి.కె.ను సంజీవిని ,కాయకల్ప సేవితుల్ని చేసి మ్రుత్యుంజయులుగా నిలిపాయి అంటే అది అతిశోయక్తి కాదు.


జీవిత భాగస్వామి:

నాటి శ్రీ రామచంద్రునికి సీతలా నేడు జయచంద్రునికి సి.కె.లావణ్య జీవిత భాగస్వామి అయ్యి షిరిడి సాయి ఆలయ నిర్వహణ,విశ్వసాయి ట్రస్ట్ ఆద్వర్యంలో వివిద సేవా కార్యక్రమాలు చేపదుతున్నారు. కుల పిచ్చి పెట్రేగి పోయె రాజకీయ రంగంలో ఉంటూ కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్న సి.కె.ను పలువురు పొగడ్తలతో ముంచెత్తారు. షిరిడిలో వివాహం చేసుకున్నప్పటికి చిత్తూరులోని తమ మిత్రులు ,అభిమానులు, కార్య కర్తలకు, ప్రత్యేకంగా ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసారు సి.కె.

ఎన్నికల సంవత్సరం 2009:

ఎన్నికల సంవత్సరంగా పుట్టి పుట్టకనే 2009వ సంవత్సరం జలయఝ్న కర్త డా.వై.ఎస్. చేతుల మీదుగా రాయల సీమ అభివ్రుద్ది బోర్డు చేర్మన్ పదవిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో సేవా తత్పరులు,త్యాగ శీలి,పోదిత ప్రజా పక్షపాతి,కుల పిచ్చి,మత గజ్జి లేని ఏకైక నాయకులు,చిత్తూరు పట్టణంలో దశాబ్దాలుగా నెలకొన్న చీకటియుగాన్ని చీల్చుకుంటూ ఉదయ బానువై ఉదయించిన సి.కె.ను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవడం మనందరి బాధ్యత. పదవులతో పని లేని స్థిత ప్రజ్నులాయన . కాని కేవలం ఒక పురపాలక నిర్వహణా పర్యవేక్షణ ద్వారే చిత్తూరు పట్టణ రూపు రేఖలను తీర్చి దిద్దిన సి.కె.ను ఎం.ఎల్.ఎ. గా గెలిపించుకోవడం మన అవసరం. మన బాధ్యత . ప్రజా స్వామ్యం పై విశ్వాసం లేక పాశవిక ,భౌతిక దాడులకు పాల్పడ్డ దుష్ట శక్తులకు వారి ప్రోత్బలం తో తిన్నింటి వాసాలు లెక్కించటానికి వస్తున్న వారికి బుద్ది చెప్పే అవకాశం రానే వచ్చిందని సి.కె.అభిమానులు భావిస్తున్నారు.


2009 అసెంబ్లి ఎన్నికల్లో ఓటరు మహాశయుల బాధ్యత


ఎన్నికల బరిలోని పార్టీలు:


బరిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. వారి 9 సం.ల దుష్పరిపాలన ఇప్పటికీ పీడకలలై ప్రజలను బెదిరిస్తూనె ఉన్నాయి.వారు ఎన్ని హామీలు గుప్పించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో ఎన్.టి.ఆర్.అమలు చేసిన 2 రూ.లకే కిలో బియ్యం పథకాన్ని భూస్థాపితం చేసి, ఎన్.టి.ఆర్ .రైతులకు రూ.50 ల కే హార్స్ పవర్ కరెంటిస్తే ,విద్యుత్ చార్జీలను పెంచి, బిల్లు బకాయిల వసూళ్ళ కోసం రైతుల పై క్రిమినల్ కేసులు పెట్టిన వైనాన్ని ప్రజలింకా మరిచిపోలేదు. నాటి కరవు కాటకాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ఠ్ర ప్రజల కోసం పంపిన కరవు బియ్యాన్ని పచ్చ చొక్కా వారు పంది కొక్కుల్లా బొక్కిన తీరును ఓటర్లు మరిచే ప్రసక్తే లేదు.

నాడు ఎన్.టి.ఆర్ ను వెన్నుపోటుతో చంపి, నేడు ఆయన వారసులను సైతం ప్రచారంలో
దింపో వారికి సైతం వెన్ను పోటు పొడవాలని చూసే చంద్రబాబు ఆటలు ఇక సాగవని నిజమైన ఎన్.టి.ఆర్ అభిమానులు హెష్చరిస్తున్నారు.

రైతులకు ఉచిత విద్యుత్,రెండురూపాయలకే కిలో బియ్యం అందిస్తూ,ఎన్.టి.ఆర్ “నా తెలుగింటి ఆడపడుచులని కొనియాడిన మహిళలకు పావలా వడ్డి రుణాలందిస్తున్న వై.ఎస్.ఆర్ ఒకరే ఎన్.టి.ఆర్ అసలు సిసలైన రాజకీయ వారసుడని వారు చెబుతున్నారు.


కాంగ్రెస్ పార్టి హయాంలో అభివ్రుద్ది:


మన దేశం వ్యవసాయానికి అనువైన దేశం . మన దేశంలోని 70 శాతం ప్రజలు వ్యవసాయరంగం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మిగిలిన 30శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న 70 శాతం ప్రజలకు కావల్సిన పరికరాలు ,వస్తువుల తయారి,సేవలు అందిస్తూ బ్రతుకుతున్నారు.
వ్యవసాయ రంగానికున్న ఏకైక సమస్య సాగు నీటి కొరత. సాగు నీటి కొరత సమస్య పరిష్కరించ బడితే ఆ 70 శాతం ప్రజలే కాక,వారి మీద ఆధార పడి బ్రతికే 30శాతం ప్రజలు కూడ అభివ్రుద్ది చెందుతారు. ఈ సత్యాన్ని తమ పాద యాత్ర ద్వార తెలుసుకున్న డా.వై.ఎస్. తమ 5 సం.ల పరిపాలనలో లక్ష కోట్లతో జలయజ్నం మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టులు పూర్తైతే కాని రాష్ఠ్రానికి ,యావన్ మంది ప్రజలకు అభివ్రుద్ది లేదు. కాంగ్రసేతర ప్రభుత్వాలకు దూరద్రుష్ఠి లేనందున అవి ఖచ్చితంగా జలయజ్నాన్ని గాలికొదిలేసి కలర్ తమ కార్య కర్తలకు మాత్రం కలర్ టివిలు ఇచ్చి చేతులు దులుపుకుంటాయి సుమా!

వై.ఎస్. సంక్షేమ పథకాలు:


రైతులకు రుణ మాఫి, ఇది వరకే రుణం తిరిగి చెల్లించి ఉంటే రూ.5000 ప్రోత్సాహకం,మైనారిటిలకు రిజర్వేషన్,ఉచిత విద్యుత్,రెండు రూ.లకే కిలో బియ్యం, రూ.150లకే వంట సరుకులు, మహిళలకు పావలా వడ్డికే రుణాలు,నిరుపేదలకు సైతం కార్పొరే ట్ చికిత్సను ఉచితంగా అందించే ఆరోగ్య శ్రీ,ఇందిరమ్మ గ్రుహాలు,రాజీవ్ గ్రుహ కల్ప,108,104 ఆంబులెన్స్ సర్వీసులు,నిరుధ్యోగులకు లక్షకు పైగా ఉధ్యోగాలు,సం.లో 100రోజుల ఉపాది హామి పథకం, ఎస్.సి.,ఎస్.టి.బి.సి విథ్యార్థులకు కేవలం ఒక కుల ధ్రువీకరణ సర్టిఫిటుంటే చాలు ,డబ్బులతో పని లేకుండా ఎంతటి ఉన్నత విద్యనైనా పొంద వచ్చన్న స్థితిని తెచ్చింది ఒక్క వై.ఎస్. మాత్రమే! స్కాలర్ షిప్పుల కొరకు కాళ్ళరిగేలా తిరిగే పని లేక బ్యాంకు ఖాతాల ద్వార నేరుగా డబ్బులందే ఏర్పాటు, గర్భిణి స్త్రీలకు ’జననీ సురక్షా’, వికలాంగులకు ,వ్రుద్దులకు,వితంతువులకు,రైతు కూలిలకు లేదనక అర్హులందరికి పించన్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో అంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వై.ఎస్. నేత్ర్రుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న అసెంబ్లి ఎన్నికల్లో గెలవడం ఖాయం,వె.ఎస్.మళ్ళి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇటీవల వెలువడిన సర్వేలు కూడ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి

సి.కె.గెలిచి తీరాలి:


ఈ పరిస్థితిలో రాష్ఠ్రంలో వై.ఎస్.నేత్రుత్వంలోని కాంగ్రెస్ పార్టి అధికారంలో కొనసాగుతుండగా ఇక్కడ వై.ఎస్. ఆత్మీయులు సి.కె. ఎం.ఎల్.ఎ గా గెలుపు పొందితే అంతకు మించిన అద్రుష్ఠం మరొకటి లేదు. అభివ్రుద్ది రెప్ప పాటులో జరిగి పోతుంది. సంక్షేమ పథకాలు మూకుమ్మడిగా అమలవుతాయి.




ఆలోచించండి:



ఎన్నికల బరిలో ఉన్న శ్రీ.సి.కె.బాబు గారి విశిష్థ వ్యక్తిత్వం,ఆదర్శ ప్రాయ ఆలోచనా విదానం,కార్చాచరణలను ఇక్కడ పొందు పరిచాం. వీటిని ఓటర్లు పరిశీలించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం


విభిన్న వ్యక్తిత్వం :
ఒక వ్యక్తిని గంట సేపు గమనిస్టె అతను ఏ కోవకు చెందిన వ్యక్తో ఇట్టె చెప్పెయ్య వచ్చు .ఒక కోవకు చెందిన వ్యక్తులు అదే కోవకు చెందిన వ్యక్తులతో కలవడానికె ఇష్ఠపడతారు. కాని సి.కె.విషయానికొస్తే ఆయన మేధావి వర్గానికి చెందినవారా? కేవలం ప్రజల కష్ఠ నష్ఠాలను చూసి స్పాంటేనియస్ గా స్పందించే మనసున్న మనిషా? అంచనా వేయడం కష్ఠమే! కాని సి.కె. “నాకు ప్రజలు ,నాయకులు మెచ్చుకునేలా మాట్లాడటం చేతకాదు” అని తనె చెబుతారు. తీరా చూస్తే తమ ప్రసంగాల్లో ముత్యాలను రాలుస్తారు.


ఉదాహరణకు కొన్ని ముత్యాలు:


వేదిక:పురపాలక ఉద్యోగుల సంఘం వారు సి.కె.బాబును సన్మానించటానికి ఏర్పాతు చేసిన సన్మాన సభ


సికె.రాల్చిన ముత్యం:

“స్వార్థం వీడి,నిస్వార్థంగా ప్రజా సేవకే అంకితమైతే ప్రజలు మెచ్చుకుంటారు. ఇలా సన్మానిస్తారు. ఆ ప్రజలను విస్మరిస్తే వారే మరో లా సన్మానిస్తారు”

-ప్రతి రాజకీయ నాయకుడు తన డైరిలో వ్రాసి పెట్టుకోవల్సిన మాట ఇది.
వేదిక: ఉర్దూ షాదిమహాల్ లో ముస్లీం మైనారిటి సంఘం వారు ఏర్పాటు చేసిన సన్మాన సభ.

సికె.రాల్చిన ముత్యం:
“ఇది ఎన్నికల సమయం. రానున్న రెండు నెలల్లో కొత్త కొత్త వారు వస్తారు. ఏదో విదంగ మిమ్మల్ని ప్రలోభపెడతారు. ఎన్నికలై పోతే ఎవ్వరూ కనబడరు.ఒక్క విషయం గుర్తు పెట్తుకొండి..చివరిదాక మీకు నెను,నాకు మీరే ఉంటాం”



ఆశ్రితుల కల్పతరువు:


ఇంకో సందర్బములో ఒక అమ్మాయి ఇదివరకే పళ్ళైనతని మాయలో పడిపోయి డబ్బు,నగలు సర్వస్వం పోగొట్టుకుంది.పైగా ఆమెకు కిడ్ని ఫెయ్ల్యూర్ అయ్యింది. ఈ దుస్తితిలో ఆమెను కొట్టి తరిమి వేసాడు ఆ ప్రభుద్దుడు. ఆందాక సి.కె. మొఖమన్నా చూడని ఆ అభల సి.కె.వద్దకు వెళ్ళింది. తక్షణం ఆ ప్రాంతంలోని ఒక శ్రేయోభిలాషికి ఈ విషయం చెప్పి పోలీసుల ద్రుష్ఠికి తీసుకెళ్ళమన్నారు. ఆమెకు న్యాయం జరిగింది.

ఇలా ఒకటి కాదు రెండు కాదు ..ఇతర నాయకుల్లా స్వంత వ్యాపారాలు చూసుకుంటూ పొరుగు రాష్ఠ్రాలకు నియోజిక వర్గానికి షటిల్ ప్రయాణాలు చేసే అలవాటు సి.కె.బాబుకు ఏనాడు లేదు. ఒకటి రెండు సందర్బాల్లో రాజాదానిలో ఉంటూనే ఆర్తుల అభ్యర్దనలకు న్యాయం చేసిన సందర్బాలు కూడ లేక పోలేదు.


సమానత్వం:


సి.కె.సమక్షంలో చిన్న ,పెద్దా అనే తేడాలుండవు. సీనియారిటి జాబిదాలుండవు.ప్రతి ఒక్కరు సి.కె.తో ఎంతో చనువుగా ఉంటారు. ఎవరికన్నా ఒక్కటే న్యాయం..ఒకతను సి.కె.తో తనకున్న పరిచయానుబంధాలుకారణంగా తను ఏంచేసినా సరిపోతుందని భావించి పొరుగింటి స్థలాన్ని ఆక్రమించ చూసాడు. భాధితులు ఈ విషయాన్ని సి.కె.ద్రుష్ఠికి తీసుకెళ్ళారు. వారు గతంలో ఏనాడూ సి.కె. ముఖం కూడ చూసి ఎరుగరు. కాని సి.కె.ఒక్క క్షణం కూడ ఆగ లేదు వెంటనే తమ చిర కాల పరిచయస్తుడైన వ్యక్తికి చెప్పాడు” నువ్వు చేసింది తప్పు..వెంటనే సరి దిద్దుకో”


చితూరు టైగర్:


పులి సంచరించే వనములో గుంట నక్కలు ఎలా పొదల్లో దాగి,తోక ముడుచుకుని ఉంటాయో అలా వారు దాగి ఉండవలసి రావడంతో ఎన్నో అన్యాయాలు అరికట్ట బడినాయి. ఆయన ద్రుష్ఠికి రాక పోవడము చేత కొన్ని అక్రమాలు గుట్టు చప్పుడు గౌప్యంగా జరిగి పోయుందేమోగాని సి.కె.ద్రుష్టికి పోయిందని తెలుస్తేనే చాలు ,అరే తెలియ వలసిన పని కూడ లేదు, తెలిసి పోయిందన్న బోగట్టా వారి చెవులకు చేరితే చాలు తోకలు ముడిచే వారు.


సర్వదా దోపిడీల పై ఉక్కు పాదం:



సి.కె.పేరు వింటే పది వడ్డి,మీటర్ వడ్డి,స్పీడు వడ్డి వ్యాపారస్తులు,ఆకతయిలు, ఆకు రౌడీలు హడలై పోతారు. ఆయన ఎప్పుడూ ఇటువంటి దోపిడిని ప్రోత్సహించ లేదు. తమ ద్రుష్టికి వచ్చినప్పుడు ఉపేక్షించేవారు కాదు. తద్వారా ఫుట్పాతు లోని చిరు వ్యాపరస్తులు, ఒక మోస్తరు వ్యాపరస్తులు నెమ్మతిగా స్వాశ పీల్చుకునే స్థితి ఏర్పడింది. మొన్న మొన్న కూరగాయల వ్యాపారస్తులకు అధిక వడ్దికి అప్పులిస్తూ వారి రక్తాన్ని పీల్చి కులుకుతున్న వ్యక్తి ఒకరు మార్కెట్ దరి దాపుల్లోకి రాకుండా పోయిన మా ట ప్రజలకు విదితమే!
ఆయన మనస్సు ఎప్పుడూ ఫుట్ పాత్ చిరు వ్యాపారస్తులు, అనగారిన వర్గాలు ,భాధితులు,మైనారిటిలు, ,త్రోపుడు బండ్ల పై వ్యాపారం ఛేసే వారి పట్ల ముగ్గింది కాని , కోటీశ్వరులు,లక్షాధికారుల పట్ల ముగ్గలేదు. కాని సి.కె.వైరి వర్గాలు సదా సంపాదనే దేయంగా,దోపిడే మార్గంగా పని చేసారు. అది విద్యా రంగం కావచ్చు , పరిశ్రమ రంగం కావచ్చు వారి ప్రప్రధమ దేయం సంపాదనే..


విథ్యా సేవ:


సి.కె.తలచుకుంటే కాలేజీలేం ఖర్మ..విశ్వవిద్యాలయాలు సైతం వెలుస్తాయి. కాని సి.కె.తనకున్న ప్రజా బలాన్ని,ప్రాభల్యాన్ని,పలుకుబడిని ఏనాదు తన స్వార్థానికి వినియోగించి ఎరుగరు. చిత్తూరు టవున్ చిన్న బ్రాహ్మణ వీథిలోని రామక్రుష్ణా పాఠశాలకు బయ్యా ఆంజనేయులు శెట్టి, బయ్యా నరసింహులు గుప్తా,బయ్యా మల్లికార్జున గుప్తా,బయ్యా ప్రభాకర గుప్తాలతో సంప్రదించి సుమారు 20 లక్షల .విలువ గల భూమిని ఇప్పించారు. విథ్యావంతులైన పలువురికి పదవులు కట్టపె ట్టారు. విథ్యార్థి నాయకులను దగ్గర తీసుకుని వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేసారు. సి.కె.ఎందరో పేద ,బడుగు విథ్యార్థులకు తమ పలుకుబడితో ఎన్నో కాలేజీల్లో సీటు ఇప్పించిన మాట అక్షర సత్యమ్.
అన్ని వర్గాలకు ప్రాధన్యం:
ఇదివరకె చెప్పుకున్నట్లు సి.కె.సమ ద్రుష్ఠి,సమానత్వం కారణంగా అన్నివర్గాల వారికి సమానంగా పదవులు,బాసట,సాయం లభిస్తున్నాయి. మైనారిటిలు అయితేనేమి,దళితులు, స్త్రీలు అయితేనేమి(దళిత స్త్రీకి చేర్మన్ పదవి) ఇది..సి.కె.తన పరిదిలో అమలు చేసి చూపిన సామాజిక న్యాయం. ఉత్తుత్తే సామాజిక న్యాయం అంటూ మాటల్లో చెప్పడం కాదు సి.కె.లా ఆచరణలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే అగ్ర కులస్తులన్న కారణంగానో ఏమో కొంత మెరకు మరుగున పడిన వైస్య కులస్తులకు మార్కెట్ కమిటి చేర్మన్,రామాలయ దర్మకర్త మండలి చేర్మన్,అగస్తీశ్వరాలయ దర్మకర్త మండలి డైరక్టర్ తదితర పదవులను సి.కె. కట్ట పెట్టారు.


JMC శ్రీనివాసులు:


విథ్యావంతుడు,పట్ట బద్దుడు,నిరుధ్యోగిగా ఉన్న యాదమరిమండలం ,జంగాలపల్లె గ్రామానికి చెందిన నేటి JMC శ్రీనివాసులును దగ్గరకు తీసుకుని అన్నివిదాల సాయం చేసి జీవనోపాది కల్పించి కాంట్రాక్టరుగా స్థిర పడేలా చేసింది సాక్షాత్తు సి.కె. అంత చేసిన సి.కె.పై ప్రజారాజ్యం పార్టి తరపున పోటికి దిగడం విశ్వాస ఘాతుకం కాదా అని సి.కె.అభిమానులుప ప్రశ్నిస్తున్నారు. గత మార్చి12నాడు స్థానిక మురకంబట్టు వద్ద తన పేరిట రెజిస్టర్ అయిన వాహణంలో ,తన సిబ్బంది ఒకరు ప్రేలుడు పదార్థాలను తరలిస్తూ పట్టు బడటం అందరికి విదితమే. క్వారి కార్యక్రమాలకే వినియోగించేట్లైతే లైసెస్న్ లేకుండా తరలించిన అవసరం ఎందుకొచ్చిందో ప్రజలు ఆలోచించాలి.

2007 ఫిబ్రవరి దాక ఏదోవిదంగా సి.కె.ను రాజకీయంగా అనగ తొక్కాలని శతవిదాలుగా ప్రయత్నించిన విపక్ష ,స్వపక్ష నేతలు ఊళ్ళో బిడ్డలను భావిలో తోసి లోతు చూసిన చందాన యువకులను సి.కె.కు వ్యతిరేకంగా ఉసికొలుపుతున్నారు,డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. ఈ కోవకు చెందిందే బుల్లెట్ సురేష్ రాజకీయ ప్రవేశం.
బుల్లెట్ సురేష(1987)
పి.వి.కె.ఎన్ కళాశాలలో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నిలొచ్చాయి. ఇప్పట్లోనైతే 18 ఏళ్ళు నిండిన వారికి ఓటు హక్కు ఉంది. రాజకీయ నాయకులు యువతను తమ వలలో బంధించటానికి ప్రయత్నించటంలో తర్కం ఉంది. కాని అప్పట్లో 21 సం.లు నిండితేనే ఓటు. అయినా సి.కె.వద్దకు విథ్యార్థులు కుప్పలు తెప్పలుగా వచ్చేవారు. నేటికి మూడు దశాబ్దాల రాజకీయ జీవిత అనంతరం సైతం సి.కె.చుట్టు యువకులే ఉండడం అందరికి విదితం. ఈ క్రమంలో నేటి కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ. టిక్కెట్ యాస్పిరెం ట్ బుల్లెట్ సురేష్ సి.కె.వద్దకొచ్చి ఆశిస్సులు కోరారు. అప్పట్లో చిత్తూరు పట్టణములో నెలకొన్న రౌడియిజానికి ఎదురు నిలబడాలంటే సి.కె.అండే శ్రీరామ రక్షా. సి.కె.బుల్లెట్ సురేష్ ను బలపరచారు. కాని అప్పటి పాలక పక్ష ప్రేరేపిత అభ్యర్థి సురేష్ ను ఓడించటం దురద్రుష్ఠకరం.
పాఠక దేవుళ్ళకు మనవి
పదవులతో పని లేని స్థితప్రజ్నుడు శ్రీ.సికె.బాబు గారు. కాని కేవలం ఒక పురపాలక నిర్వహణ పర్యవేక్షణ ద్వారే చిత్తూరు పట్టణపు రూపు రేఖలను తీర్చి దిద్ది, కేవలం ఒకే రోజున కోటి రూపాయల అభివ్రుద్ది పనులకు ప్రారంభోత్సవం చేసిన సి.కె.ఎం.ఎల్.ఏ గా గెలుపు పొందడం మన అవసరం. సి.కె. ను గెలిపించటం మన అందరి బాధ్యత. తమ భందు మిత్రులు నిరక్షరాశ్యులై ఉంటే ఈ గ్రంథంలోని విశేషాలను వారికి వివరించండి...