Friday 11 December 2009
సమైక్య ఆంధ్రప్రదేశ్---సి.కె.బాబు----రాజీనామా---- ఎం.ఎల్.ఏ పదవి పెద్ద లెక్క కాదు
నిన్న సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశమైన రాయలసీమ శాసన సభ్యులు సమైక్య ఆంధ్ర కోరుతూ తమ పదవులకు రాజీనామా చేసారు . తర్వాత కమిటీ హాల్ లో సమావేశ మైన కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు తమ పదవులకు రాజీనామా చేసారు. అందులో మన చిత్తూర్ ఎం.ఎల్.ఏ సి.కె.బాబు గారు కూడా రాజీనామా చేసారు.
ఆయన న్యూస్ లైన్ తో ఇలా చెప్పారు " సమైక్య ఆంధ్రప్రదేశ్ " మా ప్రధాన డిమాండ్ . రాష్ట్రం ముక్కలు చేయాలి అని చూస్తే తిరుపతి రాజధానిగా ' గ్రేటర్ రాయలసీమ ' ఇవవలసిందే. అదే విధంగా ప్రత్యేక పక్యేజి ని కూడా ప్రకటించాలి . ఎం.ఎల్.ఏ పదవి పెద్ద లెక్క కాదు, అందుకే రాజీనామా చేశాను చెప్పారు.
సి.కె.బాబు మాత్రమే కాదు ప్రతి ఒకరు సమైక్యత ఆంధ్ర గా నే ఉండాలి అని ఆశాభావం చెప్పారు. సి.కె.బాబు గారి ఆధ్వర్యం లో పటణం లో ధర్నా నిర్వహించారు.
చిత్తూర్ పట్టాన కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివ , మునిసిపల్ చైర్మన్ సరళ మేరి , vice చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్త లు పెద్ద సంక్యలో పాల్గొనారు. ప్రతి కళశాల విద్యార్థులు పాల్గొనారు.
న్యూస్- చిత్తూర్- దినేష్ రెడ్డి................
www.ckforchittoor.blogspot.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment